Hyderabad: కూకట్ పల్లిలో ఘరానా దొంగ అరెస్టు

  • ఫర్నిష్ డ్ ప్లాట్లే లక్ష్యంగా చోరీలు
  • నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగేవాడు
  • నిందితుడికి సహకరించిన మరో వ్యక్తీ అరెస్టు

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ ఘరానాదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఫర్నిష్ డ్ ప్లాట్లే లక్ష్యంగా చేసుకుని శ్రీవాస్తవ అనే వ్యక్తి, నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో ఆయా ప్లాట్లలో అద్దెకు దిగి సామాన్లను అపహరించేవాడు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5 టీవీలు, 8 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితుడు శ్రీవాస్తవ ఢిల్లీ యూనివర్శిటీలో బీటెక్ చేసినట్టు తెలిపారు.

More Telugu News