Vizag: మావోయిస్టులన్న అనుమానంతో అరెస్ట్... జైలు నుంచి విడుదలైన నిమిషాల వ్యవధిలో మళ్లీ అదుపులోకి!

  • మూడు నెలల క్రితం నలుగురి అరెస్ట్
  • కండిషనల్ బెయిల్ ను ఇచ్చిన కోర్టు
  • వెంటనే మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు

ఆ నలుగురినీ మావోయిస్టులన్న అనుమానంతో మూడు నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం విశాఖ కేంద్ర కారాగారం నుంచి వారు బెయిల్ పై విడుదల కాగానే, నిమిషాల వ్యవధిలో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్టు చేశారన్న విషయం తెలియరాలేదు.

విశాఖ జిల్లా పెదబయలుకు చెందిన గిరిజన యువకులు నూకరాజు, పాంగి కామేశ్వరరావు, గొల్లూరి రాజు, వంతల రావులను మూడు నెలల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్ ఖైదీలుగా వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉంచారు. వీరికి కోర్టు కండిషనల్‌ బెయిల్‌ ను మంజూరు చేసింది.

దీంతో నలుగురూ నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. తమ కోసం వచ్చిన బంధువులతో కలిసి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఆపై పైనాపిల్‌ కాలనీ వద్ద వారిని అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పి, తమ వెంట తీసుకెళ్లారు.

More Telugu News