MRO: మందేసి వైసీపీ నేతలతో చిందేసిన ఎమ్మార్వోకు షాక్ ఇచ్చిన అధికారులు

  • తోటలో ఉద్యోగులతో పార్టీ చేసుకున్న నరసింహమూర్తి
  • ఆ తర్వాత వైసీపీ నేతలతో కలిసి డ్యాన్సులు
  • వైరల్ అయిన వీడియో

శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వోపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఓ తోటలో ఉద్యోగులతో మందు పార్టీ చేసుకుని... ఆ తర్వాత వైసీపీ నేతలతో కలసి డ్యాన్స్ చేసిన ఎమ్మార్వో నరసింహమూర్తికి పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మార్వో మందు కొట్టి, చిందేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో ఆగ్రహానికి గురైన ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.

More Telugu News