Chiranjeevi: చిరూ మూవీ విడుదల తేదీపై నిర్ణయం!

  • చిరూ మూవీకి కొరటాల సన్నాహాలు 
  •  కథానాయికగా త్రిష ఖరారనే టాక్ 
  • ఆగస్టు 14న విడుదల చేయాలనే ఆలోచన

చిరంజీవి 152వ సినిమా కొరటాల దర్శకత్వంలో రూపొందనుంది. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను జూలై నాటికి పూర్తిచేసి, ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో కొరటాల వున్నట్టుగా సమాచారం. దాదాపు అదే డేట్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కథానాయికగా 'త్రిష' ఖరారైపోయిందనే అంటున్నారు. ప్రాచీన దేవాలయాలు .. ఆ దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News