Congress: అనివార్య కారణాలతో 'భారత్ బచావో' ర్యాలీ వాయిదా: కాంగ్రెస్

  • ఈ నెల 30న జరగాల్సిన ర్యాలీ
  • డిసెంబర్ 14కు వాయిదా
  • వెల్లడించిన కేసీ వేణుగోపాల్

ఈనెల 30న తలపెట్టిన 'భారత్ బచావో ర్యాలీ'ని వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది . అనివార్య కారణాలతో ర్యాలీని వాయిదా వేశామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 14న ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు.

 కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేకిగా మారారని, బీజేపీ ప్రభుత్వ పాలన అడ్డదారిలో నడుస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని తలపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దీన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందునే ర్యాలీని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుందని తెలుస్తోంది.

More Telugu News