Tamilnadu: తమిళ ప్రజల కోసం కమలహాసన్ తో కలిసేందుకు సిద్ధం... రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

  • తలైవా కోసం తమిళ ప్రజల ఎదురుచూపులు
  • ఇంకా పార్టీ ప్రకటన చేయని రజనీకాంత్
  • చర్చనీయాంశమైన  తాజా వ్యాఖ్యలు

తమిళ తలైవా రజనీకాంత్ తన పార్టీ ప్రకటన ఎప్పుడు చేస్తారా అని యావత్ తమిళులతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాను ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నట్టు పలుమార్లు పేర్కొన్న రజనీ పార్టీ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు కూడా వస్తున్నా ఆయన మాత్రం తన వైఖరికే కట్టుబడి ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తమిళ ప్రజల కోసం కమలహాసన్ తో కలిసేందుకు సిద్ధమని రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తామిద్దరి ధ్యేయం అయినప్పుడు తాము ఎందుకు కలవకూడదని రజనీ అభిప్రాయపడ్డారు. కమల్, తాను ఎప్పటికీ మంచి స్నేహితులమేనని రజనీ పునరుద్ఘాటించారు. కాగా, రజనీ తాజా వ్యాఖ్యలపై కమల్ సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News