Hyderabad: పెద్ద శబ్దం చేస్తూ అమీర్ పేటలో నిలిచిపోయిన మెట్రో రైలు!

  • ‘మెట్రో’లో తలెత్తిన సాంకేతిక సమస్య
  • విద్యుత్ సరఫరాలో లోపంతో తలెత్తిన సమస్య  
  • బేగంపేట-అమీర్ పేట స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ లో సాంకేతిక సమస్య

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అమీర్ పేట స్టేషన్ సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా మెట్రో రైలు ఆగిపోయింది. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, విద్యుత్ సరఫరాలో లోపం వల్లే రైలు నిలిచిపోయిందని చెప్పారు. బేగంపేట-అమీర్ పేట స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ లో సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని అన్నారు. మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని, సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనతో అమీర్ పేట- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

More Telugu News