Earth Quake Indo- nepal border: ఢిల్లీలో భూ ప్రకంపనలు.. బయటకు పరుగులు తీసిన ప్రజలు

  • భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం
  • ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో కూడా భూ ప్రకంపనలు
  • రిక్టర్ స్కేల్ పై 5.1గా తీవ్రత నమోదు

ఢిల్లీలో ఈ సాయంత్రం భూ ప్రకంపనలు సంభవించాయి. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూ కంపం కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనలు ఢిల్లీ-ఎన్ సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా వచ్చాయని తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయిందన్నారు.

More Telugu News