Tsrtc: కోర్టు తీర్పును పరిశీలించాక సమ్మెపై నిర్ణయం తీసుకుంటాం: జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  • ముగిసిన ఎంప్లాయీస్ యూనియన్ నేతల సమావేశం
  • కార్మికుల సమ్మె యధాతథంగా కొనసాగుతుంది
  • ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయి

టీఎస్సార్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతల సమావేశం ముగిసింది. సమ్మె కొనసాగించాలని ఈయూ నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని యూనియన్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, కోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత సమ్మెపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని డిపోల ఆర్టీసీ కార్మికుల అభిప్రాయాలు తీసుకున్నామని, జేఏసీ నేతల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు చెప్పారని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని మరోమారు స్పష్టం చేశారు.

More Telugu News