panyam: కాటసాని పాదయాత్రలో అపశ్రుతి.. అనుచరుల వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలు!

  • శ్రీశైలంకు పాదయాత్ర చేస్తున్న కాటసాని
  • పాదయాత్ర ముందు వెళ్తున్న కాటసాని వాహనం
  • వాహనం బోల్తా ఘటనలో అనుచరులకు గాయాలు 

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి అనుచరుల వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా, నాలుగు రోజుల క్రితం యాగంటి నుంచి శ్రీశైలంకు కాటసాని పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముందు వెళ్తున్న కారులో కాటసాని అనుచరులు ప్రయాణిస్తున్నారు.

More Telugu News