Sandeep Madhav: ఇంటర్ చదువుతున్నప్పుడు జార్జిరెడ్డి పేరు తొలిసారిగా విన్నాను!: చిరంజీవి

  • నేను చదువుకునే రోజుల్లో 'జార్జి రెడ్డి' పేరు విన్నాను
  • పాట వినగానే ఉద్వేగానికి లోనయ్యాను 
  • ఇలాంటి సినిమాలు రావాలన్న చిరంజీవి

విద్యార్ధి నాయకుడైన జార్జి రెడ్డి .. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. అలాంటి 'జార్జి రెడ్డి' జీవితచరిత్రను జీవన్ రెడ్డి సినిమాగా రూపొందించాడు. సందీప్ మాధవ్ ప్రధానపాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ను అభినందిస్తూ చిరంజీవి మాట్లాడారు.

"1972లో నేను ఒంగోలులో ఇంటర్మీడియెట్ చదువుకునే రోజుల్లో 'జార్జి రెడ్డి' పేరు విన్నాను. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమా కారణంగా వింటున్నాను. ఈ సినిమాలోని 'అడుగు .. అడుగు' అంటూ సాగే పాటను వింటూ నేను ఉద్వేగానికి లోనయ్యాను. జార్జి రెడ్డి ఆశయం .. ఆచరణ .. విద్యార్థినాయకుడిగా ఆయన సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారని తెలుస్తోంది. చైతన్యవంతులను చేసే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి .. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News