Sai Dharam Tej: నా సినిమా గురించి ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు: దర్శకుడు మారుతి

  • తేజు - రాశిఖన్నా జంటగా 'ప్రతిరోజూ పండగే'
  •  డిసెంబర్ 20వ తేదీన విడుదల 
  •  కొత్త కాన్సెప్టుతో వస్తున్నామన్న మారుతి 

దర్శకుడు మారుతి తాజా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందింది. సాయిధరమ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా, డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాను గురించి మారుతి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో హీరో ఊరును బాగు చేయడానికి పల్లెటూరుకి వస్తాడనీ, తండ్రినీ .. తాతను కలపాలనే ఉద్దేశంతో వస్తాడని .. ఇలా ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు.

 నిజానికి అలాంటి పాయింట్ తో నేను ఈ సినిమా చేయలేదు. ఒక మనిషి పుట్టుకను కుటుంబ సభ్యులు ఎలా సెలబ్రేట్ చేస్తారో, చనిపోయినప్పుడు బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. ఇంతవరకూ ఇలాంటి కాన్సెప్టును ఎవరూ టచ్ చేయలేదు. ఈ కథ చిరంజీవిగారికి కూడా చాలా బాగా నచ్చింది .. హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News