Allu Arjun: తాతయ్యతో 29 ఏళ్ల క్రితం నాటి ఫొటోను పోస్ట్ చేసిన అల్లు అర్జున్!

  • అప్పటి తీపి గుర్తులను గురించి తెలిపిన అల్లు అర్జున్
  • పద్మశ్రీ అందుకుని తిరిగి వస్తున్న తాతయ్యకు స్వాగతం పలికాం
  • మేమంతా విమానాశ్రయానికి వెళ్లాము
  • పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు ఆయన ప్రయాణం అద్భుతం

తన తాతయ్య అల్లు రామలింగయ్యతో 29 ఏళ్ల క్రితం దిగిన ఫొటోను సినీనటుడు అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి అప్పటి తీపి గుర్తులను గురించి తెలిపాడు. ఈ ఫొటోలో ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. 'పద్మశ్రీ అందుకుని తిరిగి వస్తున్న తాతయ్యకు స్వాగతం పలకడానికి మేమంతా విమానాశ్రయానికి వెళ్లాము. పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు.. అద్భుత ప్రయాణం' అని అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.

కాగా, అల్లు రామలింయ్య స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. సినిమాల్లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో కనపడి యావత్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయనకు 'పద్మశ్రీ 'అవార్డు ప్రదానం చేసి గౌరవించింది. హాస్యనటుడు రేలంగి తర్వాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లు రామలింగయ్యే.

More Telugu News