మాతృ భాష పరిరక్షణకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలి: లోక్ సభలో వైసీపీ ఎంపీ

- ఆర్టికల్ 350, 350ఏల స్ఫూర్తి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి
- తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలి
- వందల కోట్ల నిధులు హైదరాబాదులోనే ఉండిపోయాయి
ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. తెలుగు అకాడమీకి చెందిన వందల కోట్ల నిధులు హైదరాబాదులోనే ఉండిపోయాయని ఆయన అన్నారు. విభజన చట్టంలో తెలుగు అకాడమీ కూడా ఉందని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీకి చెందిన నిధులను 58:42 నిష్పత్తిలో విభజించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.