Koti Deepotsavam: కోటి దీపోత్సవానికి హాజరైన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

  • హైదరాబాద్ లో కోటిదీపోత్సవం
  • ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలు
  • ముగిసిన కోలాహలం

భక్తి టీవీ చానల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం పరిసమాప్తం అయింది. కార్తీక మాసంలో నిర్వహించిన ఈ మహాదీప యజ్ఞం ముగిసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా చివరి రోజున రాజరాజేశ్వరి కల్యాణం నిర్వహించారు. కొల్హాపూర్ మహాలక్ష్మీ దివ్యదర్శనంతో వేలాది భక్తులు తరించిపోయారు. కాగా, చివరి రోజున ఈ కోటి దీపోత్సవానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి జనసేనాని పవన్ కల్యాణ్ ను తోడ్కొని ఆయనతో జ్యోతి ప్రజ్వలనం చేయించారు.

More Telugu News