Head Master: నన్నే ఆదేశిస్తావా అంటూ.. హెడ్మాస్టర్ కళ్లలో కారం చల్లిన టీచర్

  • పాఠశాలలో సరిగా పాఠాలు చెప్పాలన్న హెడ్మాస్టర్
  • ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్
  • గాయపడ్డ హెడ్మాస్టర్ ను ఆస్పత్రికి తరలించిన ఇతర ఉపాధ్యాయులు

పిల్లలకు పాఠాలు సరిగా చెప్పమంటూ హెడ్మాస్టర్ హెచ్చరిస్తే.. టీచర్ తట్టుకోలేకపోయాడు. నన్నే అంత మాటంటావా? అంటూ హెడ్మాస్టర్ కళ్లల్లో కారం చల్లాడు. దీనిపై తోటి ఉపాధ్యాయులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని మెదక్ జిల్లా, చేగుంట మండలంలోని రెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాఠశాలలో సమయపాలన పాటించాలని, విద్యార్థులకు పాఠాలు సరిగా చెప్పాలని టీచర్ శ్రీనివాస మూర్తిని హెడ్మాస్టర్ దేవరుషి సూచించారు. దీంతో హెడ్మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శ్రీనివాస్ మూర్తి హెడ్మాస్టర్ కళ్లల్లో కారం చల్లాడు. గాయపడ్డ దేవరుషిని ఉపాధ్యాయులు చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

More Telugu News