ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది: విజయశాంతి

- హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ
- స్పందించిన విజయశాంతి
- కేసీఆర్ పై విమర్శలు
టీఆర్ఎస్ కు చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వాళ్లు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరతారని లక్ష్మణ్ ప్రకటించిన నేపథ్యంలో, నేరుగా బీజేపీ పేరును ప్రస్తావించే ధైర్యం లేక, విపక్షాలు కుట్రకు పాల్పడుతున్నాయంటూ కోర్టులో కేసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కుట్ర జరుగుతోందన్నప్పుడు ఆ కుట్రకు పాల్పడుతోంది ఎవరో ఎందుకు బయటపెట్టడంలేదని విజయశాంతి ప్రశ్నించారు. ఆ కుట్రలో మంత్రులకూ భాగం ఉంటే, ప్రభుత్వాన్ని కూల్చి సీఎం పీఠం దక్కించుకోవాలనుకుంటున్నది ఎవరు? అంటూ అడిగారు. దీనికి కేసీఆరే జవాబు చెప్పాలని పేర్కొన్నారు.
అయినా, ఏ కుట్రలు జరగకుండానే తెలంగాణలో విపక్షం అనేది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడాయనే విపక్షాలు కుట్రలు చేస్తున్నాయనడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.