Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' విషయంలో అది పుకారు మాత్రమేనట!

  • ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • వంశీ పైడిపల్లి సూచనలు కోరిన మహేశ్
  • జనవరి 12వ తేదీన భారీ విడుదల

మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో .. ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికాగానే, మహేశ్ బాబు .. దర్శకుడు వంశీ పైడిపల్లిని రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లితో గల సాన్నిహిత్యం కారణంగా .. ఆయన విజన్ పై గల నమ్మకంతో, ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దే బాధ్యతను ఆయనకి మహేశ్ బాబు అప్పగించాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమా అవుట్ పుట్ చూసి, సూచనలు .. సలహాలు మాత్రమే ఇవ్వమని వంశీ పైడిపల్లిని మహేశ్ బాబు అడిగాడట. పూర్తి బాధ్యతను ఆయన అనిల్ రావిపూడిపైనే పెట్టాడని అంటున్నారు.

More Telugu News