dog: అయ్యప్ప భక్తుల వెనకే శునకం.. ఇప్పటికే వందల కి.మీ దూరం వెళ్లిన వైనం

  • తిరుమల నుంచి శబరిమలకు బయలుదేరిన కొందరు అయ్యప్ప భక్తులు 
  • గత నెల 31 నుంచి శబరిమలకు కాలినడకన యాత్ర ప్రారంభం
  • వారి వెంట 480 కిలోమీటర్లు నడిచిన శునకం

తిరుమల నుంచి కొందరు అయ్యప్ప భక్తులు గత నెల 31 నుంచి శబరిమలకు కాలినడకన బయలుదేరగా, వారిని అనుసరిస్తూ ఓ శునకం కూడా వెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. కొంత దూరం తమతో వచ్చి ఆ శునకం వెళ్లిపోతుందని అయ్యప్ప భక్తులు అనుకున్నారు. అయితే, అది ఏకంగా 480 కిలోమీటర్లు తమ వెంట రావడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగేహర వద్ద వారి యాత్ర కొనసాగుతోంది.

తన వెంటే ఆ శునకం 480 కిలోమీటర్లు వచ్చిందని, దీంతో దానికి కూడా ఆహారాన్ని పెడుతున్నామని అయ్యప్ప భక్తులు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. తాము ప్రతి ఏడాది శబరిమలకు కాలినడకన వెళ్తామని, ఇలా శునకం తమ వెంటే రావడం ఇదే తొలిసారని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది.

More Telugu News