Rajani: 'దర్బార్' ప్రత్యేకమన్న మురుగదాస్ .. డబ్బింగ్ పూర్తిచేసిన రజనీకాంత్

  • రజనీ తాజా చిత్రంగా రూపొందిన 'దర్బార్'
  • కథానాయికగా కనిపించనున్న నయనతార
  • జనవరి 10వ తేదీన భారీ విడుదల 

రజనీకాంత్ అభిమానులంతా 'దర్బార్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రజనీతో చేస్తున్న ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమని మురుగదాస్ చెప్పడం, అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన తన షూటింగును రజనీ పూర్తి చేశారు. ఆ తరువాత హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఆయన, ఇటీవలే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు.

రజనీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం పూర్తయిందని, తాజాగా తన ట్విట్టర్ ద్వారా మురుగదాస్ తెలియజేశాడు. రజనీతో కబుర్లు చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా మిగతా పనులను పూర్తిచేసుకోనుంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.

More Telugu News