elephant: మదపుటేనుగు ‘బిన్ లాడెన్’ మృతి!

  • ఐదుగురి ప్రాణాలు బలిగొన్న ఏనుగు
  • మత్తుమందు ఇచ్చి బంధించిన అధికారులు
  •  మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ

మదపుటేనుగు ‘బిన్‌లాడెన్’ మృతి చెందింది. ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన ఈ ఏనుగును బంధించేందుకు గత కొన్ని రోజులుగా అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఈ నెల 11న విజయవంతమయ్యాయి. పశ్చిమ అసోంలోని గోల్‌పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో కనిపించిన ‘బిన్‌లాడెన్’కు మత్తుమందు ఇచ్చి బంధించారు.

 అనంతరం దానిని జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని ఓరంగ్ నేషనల్ పార్క్‌కు తరలించారు. ఆ ఏనుగు సృష్టించిన బీభత్సాన్ని చూసి స్థానికులు దానికి ఉగ్రవాది బిన్ లాడెన్ పేరును పెట్టారు. ఆ తర్వాత అధికారులు ఈ ఏనుగుకు ‘కృష్ణ’ అని నామకరణం చేశారు.

ఓరంగ్ పార్క్‌లో వదిలినప్పటి నుంచీ ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించిన ‘కృష్ణ’ నిన్న తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలిసిన ప్రభుత్వం దాని మృతికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులను నియమించింది.

More Telugu News