Kaleshwaram: మరో అరుదైన రికార్డు స్థాపించిన కాళేశ్వరం ప్రాజెక్టు

  • ఒకే రోజు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోత
  • గాయత్రి పంప్ హౌస్ ఘనత
  • నీటిని పైకి పంప్ చేసిన ఆరు మోటార్లు

తెలంగాణలో ఇంజినీరింగ్ అద్భుతం అనదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి సత్తా చాటింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ 2 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఒక్కరోజులో ఇన్ని టీఎంసీల నీటిని పంప్ చేయడం ఇదే తొలిసారి. గాయత్రి పంప్ హౌస్ లోని 6 మోటార్లు ఈ క్రతువులో పాలుపంచుకున్నాయి.

More Telugu News