Lakshman: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ లేఖ

  • ఆయిల్ కంపెనీలు, ఆర్టీసీకి మధ్య ఒప్పందంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి
  • టీఎస్ఆర్టీసీ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణలు
  • పెట్రోల్ బంకులు టీఆర్ఎస్ నేతలకు అప్పగించారన్న లక్ష్మణ్

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కేంద్ర పెట్రోలియ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ లేఖ రాశారు. ఆయిల్ కంపెనీలకు, టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య ఒప్పందంపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. టీఎస్ఆర్టీసీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. పెట్రోల్ బంకులను నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ నేతలకు అప్పగించిందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News