Train Accident: పరీక్ష రాయడానికి వెళ్తూ పొరపాటున వేరే రైలు ఎక్కిన విద్యార్థులు.. కదులుతోన్న రైల్లోంచి దూకేసిన వైనం

  • నిర్మల్ జిల్లా బాసరలోని రైల్వేస్టేషన్‌లో ఘటన
  • ఓ విద్యార్థికి తీవ్రగాయాలు
  • నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స

నిర్మల్ జిల్లా బాసరలోని రైల్వేస్టేషన్‌లో కదులుతోన్న రైల్లోంచి ముగ్గురు విద్యార్థులు దూకేశారు. దీంతో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్‌ పరీక్ష రాయడానికి బాసర ట్రిపుల్‌ ఐటీకి చెందిన 106 మంది విద్యార్థులు నిజామాబాద్‌ బయలుదేరారు. ఈ క్రమంలో తొందరపాటులో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్‌ కు బదులుగా పర్భని పాసింజర్‌ ఎక్కారు.

ఆ పాసింజర్ కదిలాక వారికి అసలు విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆ రైల్లోంచి దూకేశారు. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారు. ఆ విద్యార్థి వరంగల్‌ జిల్లాకు చెందిన సాయికుమార్‌ అని సమాచారం అందింది.

More Telugu News