Muslim Personal Law Board: అయోధ్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు భేటీ.. హాజరైన అసదుద్దీన్ ఒవైసీ

  • లక్నోలో కొనసాగుతోన్న సమావేశం
  • ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
  • అయోధ్య తీర్పు నేపథ్యంలో కీలక భేటీ

ఇటీవల అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడైన విషయం తెలిసిందే. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చి, ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ తీర్పుపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సమావేశమైంది.

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లక్నో చేరుకొని, ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఇటీవల ఒవైసీ తెలిపిన విషయం తెలిసిందే. తాము పోరాడింది 5 ఎకరాల భూమి కోసం కాదని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రివ్యూ పిటిషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని ఆయన ఇటీవల చెప్పారు.

More Telugu News