BJP: 'ఈ ఫొటోలోని వ్యక్తి కనపడుట లేదు' అంటూ గౌతం గంభీర్ గురించి పోస్టర్లు!

  • ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం 
  • కాలుష్యంపై పార్లమెంట్‌ ప్యానెల్‌ సమావేశానికి గౌతీ గైర్హాజరు
  • ఇండోర్ వెళ్లి ఎంజాయ్ చేసిన గంభీర్
  • 'ఈ ఫొటోలోని వ్యక్తిని ఎక్కడైనా చూశారా?' అంటూ ఢిల్లీలో పోస్టర్లు

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలుష్యంపై పార్లమెంట్‌ ప్యానెల్‌ ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ హాజరు కాలేదు. ఓ వైపు సమావేశం ఉండగా, దానికి గైర్హాజరై... భారత్, బంగ్లా మధ్య జరిగిన మ్యాచ్ కి కామెంట్రీ ఇస్తూ ఆయన కనపడ్డారు. టీమిండియా మాజీ క్రికెటర్లతో కలిసి ఆయన జిలేబీలు తిన్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

దీంతో ఈ రోజు ఢిల్లీలో 'గౌతం గంభీర్ కనపడుటలేదు' అంటూ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి సమీపంలో పలు చెట్లకు కొందరు ఈ పోస్టర్లు అంటించారు. ''కనపడుట లేదు.. మీరు ఈ ఫొటోలోని వ్యక్తిని ఎక్కడైనా చూశారా? చివరి సారిగా ఇండోర్ లో అతడు తన స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనపడ్డాడు. ఢిల్లీ మొత్తం ఆయన కోసం వెతుకుతోంది'' అని ఆ పోస్టర్లలో ఉంది.
 

More Telugu News