Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న గవర్నర్ హరిచందన్!

  • నేడు ఇచ్చాపురంలో పర్యటించాల్సిన గవర్నర్
  • ఏర్పాట్లు చేసిన అధికారులు
  • వ్యక్తిగత కారణాలతో రద్దు

నేడు జరగాల్సిన తన శ్రీకాకుళం జిల్లా పర్యటనను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నేడు ఆయన ఇచ్చాపురం ప్రాంతంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి వుంది. తొలుత ఈ నెల 20న గవర్నర్ పర్యటన ఉంటుందని, ఆయన కార్యాలయం నుంచి కలెక్టరేట్, తహసీల్దారు కార్యాలయాలకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే, తన వ్యక్తిగత కారణాల వల్ల గవర్నర్, తన పర్యటనను రద్దు చేసుకున్నారని నిన్న అధికారులకు వర్తమానం అందింది. కాగా, నేడు హరిచందన్, ఒడిశా రాష్ట్రానికి వెళ్లనున్నారని, ఈ కారణంగానే శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయిందని సమాచారం.

More Telugu News