ఇసుక వారోత్సవాలు జరిపి ఏం సాధిస్తారు?: కన్నా లక్ష్మీనారాయణ

- ఇసుక కొరత ప్రభుత్వ సృష్టేనన్న కన్నా
- ఇసుక కొరత వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యలు
- వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని వెల్లడి
తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ, నేతలు రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని హితవు పలికారు. నాయకుడు నోరు పారేసుకుంటే చులకన అవుతారని వ్యాఖ్యానించారు. ఇక, జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ, రాఫెల్ అంశాన్ని రాహుల్ గాంధీ రాజకీయం చేయాలని చూశారని, ఆయన ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.