Karnataka: కర్ణాటక అమ్మాయిని ఆర్థికంగా ఆదుకున్న కేటీఆర్ స్నేహితుడు

  • వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కర్ణాటక అమ్మాయి
  • ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు సాంకేతిక సమస్యలు
  • రూ.90 వేలు చెక్కు అందించిన కేటీఆర్ మిత్రుడు

ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించడం మంత్రి కేటీఆర్ నైజం. అయితే కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థిని విషయంలో ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు సాంకేతిక కారణాలు అడ్డురావడంతో కేటీఆర్ స్నేహితుడొకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ అమ్మాయిని ఆర్థికంగా ఆదుకున్నారు. కర్ణాటకకు చెందిన శిల్పారెడ్డి అనే అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆమె వెన్నెముకకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండగా, ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అందించిన ఆర్థికసాయంతో శస్త్రచికిత్స నిర్వహించారు.

చికిత్స అనంతరం ధరించాల్సిన బెల్ట్, తదుపరి వైద్య సేవలకు శిల్పారెడ్డి కుటుంబం ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుండునని కోరుకుంది. తనకు సాయం చేయాలంటూ శిల్ప ట్విట్టర్ లో కేటీఆర్ ను అర్థించింది. అయితే శిల్పారెడ్డి కర్ణాటక అమ్మాయి కావడంతో తెలంగాణ సర్కారు నుంచి సాయం అందించే వీల్లేకపోయింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మిత్రుడొకరు ముందుకొచ్చి ఆ అమ్మాయికి రూ.90 వేలు సాయమందించారు. చెక్కును కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో శిల్పారెడ్డి తండ్రి నందీశ్ రెడ్డికి అందించారు.

More Telugu News