Telugudesam: అధిష్ఠానంపై టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ అలక!

  • నిన్న ఓ చర్చలో పాల్గొన్న వల్లభనేని వంశీ, రాజేంద్రప్రసాద్
  • రాజేంద్రప్రసాద్ కు బోడె ప్రసాద్ డబ్బులిచ్చారని ఆరోపణ
  • ఈ వ్యాఖ్యలపై అధిష్ఠానం ఉదాసీనత తగదని భావించిన రాజేంద్రప్రసాద్

‘టీవీ 9’ ఛానెల్ వేదికగా నిన్న నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ చర్చలో భాగంగా ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ కు టీడీపీ నేత బోడె ప్రసాద్ డబ్బులిచ్చారంటూ వంశీ ఆరోపణలు చేశారు. అయితే, వంశీ చేసిన ఈ ఆరోపణలను టీడీపీ అధిష్ఠానం ఖండించలేదని, ఉదాసీనంగా వ్యవహరించిందన్న భావనలో ఉన్న రాజేంద్రప్రసాద్ అలకబూనినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు రాజేంద్ర ప్రసాద్ నివాసానికి బోడె ప్రసాద్ వెళ్లినట్టు తెలుస్తోంది.

More Telugu News