Pawan Kalyan: ఢిల్లీకి బయల్దేరిన పవన్ కల్యాణ్... మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం?

  • గన్నవరం నుంచి ఢిల్లీకి పయనమైన పవన్
  • రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న పవన్
  • మోదీ, అమిత్ షాలను కలుస్తానంటూ ఇంతకు ముందే చెప్పిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పయనమయ్యారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దేశ రాజధానికి ఆయన బయల్దేరారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఢిల్లీకి పవన్ కల్యాణ్ వెళ్లినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ... ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ఆయన వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కలవనున్నట్టు తెలుస్తోంది.

ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వారికి వివరించనున్నట్టు సమాచారం. అవసరమైతే మోదీ, అమిత్ షాలను కలుస్తానంటూ ఇంతకు ముందు పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఢిల్లీకి బయల్దేరే ముందు ఈ ఉదయం మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు.

More Telugu News