Tamil Nadu: మత్తుమందిచ్చి స్నేహితుడి భార్యపై అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్

  • భర్తలేని సమయంలో నమ్మి ఇంట్లోకి రానిస్తే ఘాతుకం
  • పనికోసం పొరుగూరికి వెళ్లి తిరిగి వచ్చిన భర్త
  • బంగారం ఏదని భార్యను నిలదీయడంతో వెలుగు చూసిన నిజం

భర్త స్నేహితులని నమ్మి ఇంటికి రానిస్తే ఆమె జీవితాన్నే బుగ్గిపాలు చేశారు ఇద్దరు ప్రబుద్ధులు. మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేయడమేకాక బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.


పోలీసుల కథనం మేరకు... చెన్నై లోని విరుగంబాక్కం గాంధీనగర్ లో ఓ జంట నివసిస్తోంది. వడ్రంగి కార్మికుడైన ఇతని తొలి భార్య చనిపోవడంతో బాధితురాలిని (26) రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త పనుల నిమిత్తం రెండు నెలల క్రితం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అదనుగా సదరు వ్యక్తి స్నేహితులు వినోద్ కుమార్, హరీష్ కుమారులు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవారు. భర్త స్నేహితులే కదా అని ఆమె ఆదరించేది. 


ఈ క్రమంలో ఓసారి దేవుని ప్రసాదమని చెప్పి మత్తుమందు కలిపిన దాన్ని ఆమె చేత తినిపించారు. ఆమె నిద్రలోకి జారుకోగానే ఇద్దరూ కలసి ఆమెను అత్యాచారం చేశారు. దాన్ని వీడియో కూడా తీశారు. అనంతరం ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు.

బెదిరించి ఆమె మెడలోని మూడు సవర్ల బంగారాన్ని లాక్కున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య మెడలో బంగారం కనిపించలేదు. బంగారం ఏమైందని భార్యను నిలదీయడంతో స్నేహితుల ఘోరాన్ని ఆమె బయట పెట్టింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన అతను భార్యతో కలిసి వెళ్లి టి.నగర్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వినోద్‌కుమార్, సతీష్‌కుమార్‌పై కేసు నమోదు చేసి ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

More Telugu News