Dera Baba: డేరా బాబాకు, చంద్రబాబుకు తేడా ఏమీ లేదు: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

  • బ్లూఫ్రాగ్ కంపెనీతో ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ను హ్యాక్ చేశారు
  • చంద్రబాబుకు ఈ కంపెనీ ఎండీ అత్యంత సన్నిహితుడు
  • దొంగ దీక్షలు చేయడం చంద్రబాబుకు అలవాటే 

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతలంతా ఇసుక బకాసురులు అని, చంద్రబాబు ఇసుక మాఫియాకు రారాజు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుతంత్ర రాజకీయాల కోసం సంక్షోభాలను సృష్టిస్తున్నారని, బ్లూ ఫ్రాగ్ కంపెనీతో ఏపీ ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ను హ్యాక్ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు ఈ కంపెనీ ఎండీ అత్యంత సన్నిహితుడని అభిప్రాయపడ్డారు. ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు దొంగ దీక్షలు చేయడం అలవాటేనని విమర్శించారు. డేరా బాబాకు, చంద్రబాబుకు పెద్ద తేడా ఏమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News