Somu Veerraju: గంటాతో భేటీ అయిన బీజేపీ నేత సోము వీర్రాజు

  • గంటా నివాసానికి వెళ్లిన సోము వీర్రాజు
  • పలు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం
  • బ్రేక్ ఫాస్ట్ చేసేందుకే వచ్చారన్న గంటా వర్గీయులు

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ తరుణంతో ఈరోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గంటాను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా వీరు చాలాసేపు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇరువురి మధ్య పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు ఈ అంశంపై గంటా వర్గీయులు స్పందించారు. కేవలం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు సోము వీర్రాజు వచ్చారని తెలిపారు.

More Telugu News