Shiv Sena: మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే: మరోసారి స్పష్టం చేసిన సంజయ్ రౌత్

  • రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ పట్టువీడని శివసేన
  • ఆసుపత్రి నుంచి సంజయ్ రౌత్ డిశ్చార్జ్
  • మీడియాకు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన శివసేన నేత

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఛాతి నొప్పితో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే' అని మరోసారి వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో 50-50 ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన తమ పట్టును వీడకపోవడంతో చివరకు ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే శివసేన మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా తమ పార్టీ నేతే ఉంటారని అంటుండడం గమనార్హం.
 
కాగా, ఈ రోజు ఉదయం మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు లీలావతి ఆసుపత్రికి వచ్చి సంజయ్ రౌత్ ను కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలపై చర్చించుకున్నారు. కాంగ్రెస్ తో పాటు శివసేన మద్దతును కూడగట్టేందుకు ఎన్సీపీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

More Telugu News