Pawan Kalyan: ఇసుక దీక్ష నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ!

  • రేపు ఇసుక దీక్ష చేపట్టనున్న చంద్రబాబు
  • పవన్ నివాసానికి వెళ్లిన అచ్చెన్న, వర్ల రామయ్య
  • దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా విన్నపం

ఏపీలో ఇసుక తుపాను రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు రేపు 12 గంటల పాటు 'ఇసుక దీక్ష'ను చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వెళ్లారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది.

మరోవైపు, విశాఖలో ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వయంగా టీడీపీ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు దీక్షపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More Telugu News