Asaduddin Owaisi: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీకి ఉపకరిస్తుంది: అసదుద్దీన్ ఒవైసీ

  • మహారాష్ట్ర పరిస్థితులపై ఒవైసీ స్పందన 
  • ఎన్నికల్లో ఎంఐఎం రెండు సీట్లను గెలుచుకుంది
  • శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమన్న ఒవైసీ 

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది బీజేపీకి ఉపకరిస్తుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమున్నా తమ పార్టీ వారికి ఎట్టి పరిస్థితులలోనూ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం విదితమే. 

More Telugu News