బ్రెజిల్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

- బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొననున్న ప్రధాని
- నవంబరు 13, 14 తేదీల్లో బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు
- సంబంధాల బలోపేతం కోసం కృషి చేస్తానన్న మోదీ
బ్రిక్స్ దేశాల సదస్సు గురించి వివరిస్తూ, నవంబరు 13, 14 తేదీల్లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నానని, సరికొత్త భవిష్యత్ కోసం ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై సదస్సు జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా తాను బ్రిక్స్ వాణిజ్య మండలితోనూ, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బిజినెస్ ఫోరంతోనూ చర్చలు జరుపుతానని ట్వీట్ చేశారు.