Maharashtra: రసవత్తరంగా 'మహా' రాజకీయాలు... రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటున్న శివసేన

  • మహారాష్ట్రలో వీడని అనిశ్చితి
  • ప్రభుత్వ ఏర్పాటుకు తొలగని అడ్డంకులు
  • రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేసినట్టుగా వార్తలు

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై శివసేన వర్గాలు తీవ్రంగా స్పందించాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేయాలని శివసేన నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్ర ప్రతిష్టంభనపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ తో చర్చించారు.

More Telugu News