Rajashekar: జగన్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను: సినీనటుడు రాజశేఖర్

  • ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం సరైందే
  • ఉద్యోగాలు పొందాలన్నా ఇంగ్లిష్ భాషే ముఖ్యం
  • ఇంగ్లిషు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు

ఏపీలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై పలువురి నుంచి విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, జగన్ నిర్ణయానికి సినీనటుడు రాజశేఖర్ మద్దతు పలికారు.

'ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైందే. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలన్నా, ఇతరులతో సంభాషించాలన్నా ఇంగ్లిష్ భాషే ముఖ్యం. ఇంగ్లిషు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువుల్లో, ఉద్యోగాలు తెచ్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు' అని ట్వీట్ చేశారు.

'ఈ సమస్యలకు జగన్ తీసుకున్న నిర్ణయం ముగింపు పలుకుతుందని. నేను ఈ నిర్ణయానికి పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అలాగే, మన మాతృభాష తెలుగును కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ గా ఉంచాలని నేను భావిస్తున్నాను. సమాజంలోని అందరికీ విద్య సమానంగా అందాలి' అంటూ ట్వీట్ చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని అన్నారు.

More Telugu News