Amaravati: అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నాం: సింగపూర్ సంచలన ప్రకటన

  • స్వయంగా వెల్లడించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్
  • ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టీకరణ
  • అమరావతికి పెట్టుబడులు కొనసాగుతాయని ఆకాంక్ష 

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్టు సింగపూర్ సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి ఈశ్వరన్ స్వయంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన పరస్పర అంగీకారం తరువాత సింగపూర్ కన్సార్టియం ఈ ప్రాజెక్టుకు దూరం జరిగిందని ఆయన తెలిపారు.

తాము తప్పుకున్న కారణంగా పెట్టుబడులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో తాము పెట్టే పెట్టుబడులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. కాగా, ఇదే విషయమై నిన్న రాత్రి జగన్ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు విడుదల చేసింది. సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని ప్రకటించింది.

More Telugu News