Maharashtra: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఒవైసీ స్పందన

  • మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన ప్రయత్నాలు
  • మహారాష్ట్రలో తమకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఒవైసీ
  • గవర్నర్ కు లేఖ రాస్తామని వెల్లడి

మహారాష్ట్ర రాజకీయం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. శివసేన ప్రతిపాదనకు కాంగ్రెస్ చివరి నిమిషంలో నో చెప్పింది. అయితే, మహా రాజకీయాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తమకు మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ, శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రూపంలో తెలియజేస్తామని వెల్లడించారు.

More Telugu News