రోజుకు మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తున్నప్పుడే జగన్ పై అనుమానం వచ్చింది: నారా లోకేశ్

- సీఎం జగన్ లక్ష్యంగా లోకేశ్ విమర్శలు
- జగన్ ముఠా క్విడ్ ప్రో కో స్కెచ్ వేస్తోందంటూ ఆరోపణ
- ప్రభుత్వ ఆస్తులు అమ్మితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక
జగన్ గారు ఓ యువకుడై ఉండి పాదయాత్రలో కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నప్పుడే అనుమానం వచ్చిందని, ఇప్పుడా అనుమానం నిజమైందని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో జగన్ గారు ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తిచేశారని ఆరోపించారు. ఇప్పటికే వలంటీర్ల పేరుతో ఏడాదికి రూ.4000 కోట్ల ప్రజాధనం లూటీ చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆస్తులు కూడా అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోము అని హెచ్చరించారు.