Sivasena: పీడీపీతో బీజేపీ కలిస్తే తప్పులేదుగానీ, మేము కాంగ్రెస్ తో జతకడితే తప్పా?: శివసేన

  • మెహబూబా ముఫ్తీతో స్నేహం చేయలేదా?
  • మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి
  • శివసేన నేత సంజయ్ రౌత్ 

నిత్యమూ ఉప్పూ, నిప్పుగా ఉండే కాంగ్రెస్, శివసేన పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ, ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పీడీపీతో జమ్మూ కశ్మీర్ లో అధికారం కోసం బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, తాము కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. మెహబూబా ముఫ్తీతో బీజేపీ జతకట్టగా లేనిది, తమను ప్రశ్నించడం ఏంటని ఆయన మండిపడ్డారు.

కాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అవకాశం శివసేనకు దక్కిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న శివసేన, మ్యాజిక్ ఫిగర్ కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది.

More Telugu News