India: అయోధ్య తీర్పు నేపథ్యంలో భారత్ లో దాడులకు ఉగ్రవాదుల ప్రణాళిక.. అప్రమత్తమైన భద్రతా దళాలు

  • ఉగ్ర ముప్పుపై కేంద్రానికి వివరాలు తెలిపిన నిఘా వర్గాలు
  • దాడులను నిరోధించేందుకు చర్యలు
  • ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ లో దాడులు జరిగే అవకాశం

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు భారత్ లో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిజానికి అయోధ్య తీర్పు వెల్లడి కావడానికి ముందు నుంచే ఉగ్ర సంస్థలు భారత్ లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు వేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి భారత మిలటరీ ఇంటెలిజెన్స్‌, రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలు తెలిపాయి.

దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర వాదుల ప్రతిపాదిత లక్ష్యాలను ముందుగానే పసిగట్టి ఈ దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఉగ్రవాదులు దాడులు జరపవచ్చని నిఘా సంస్థలు చెప్పాయి.  

More Telugu News