afghanistan: అఫ్ఘాన్ వైమానిక దాడిలో తాలిబన్ కమాండర్ హతం

  • అఫ్ఘాన్ లోని లోగర్ ప్రావిన్స్ లో దాడి
  • వాయిసుద్దీన్ హతం
  • కొన్ని రోజుల క్రితం ముగ్గురు న్యాయమూర్తులను చంపిన తాలిబన్లు

ఈ రోజు అఫ్ఘానిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో తాలిబన్ కమాండర్ వాయిసుద్దీన్ హతమయ్యాడు. అఫ్ఘాన్ లోని లోగర్ ప్రావిన్స్ లో ఆ దేశ సైన్యం ఈ దాడి చేసింది. కొన్ని రోజుల  క్రితం అఫ్ఘాన్ లో ముగ్గురు న్యాయమూర్తులను ఉగ్రవాదులు హత్య చేశారు. ఈ దాడిలో వాయిసుద్దీన్ జోక్యం ఉంది. దీంతో పక్కా ప్రణాళికతో అతడి శిబిరంపై సైన్యం దాడి జరిపింది.

ఈ నెల 6న లోహార్ ప్రావిన్స్ లోని మొహమ్మద్ అఘా జిల్లాలో తాలిబన్ లు ఆ ముగ్గురు న్యాయమూర్తులను చంపినట్లు అధికారులు తెలిపారు. బాక్లీయాబాద్ ప్రాంతంలో ఆ రోజు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు. తమ కమాండర్ ను అఫ్ఘాన్ సేనలు మట్టుబెట్టిన విషయంపై తాలిబన్లు ఇప్పటివరకు స్పందించలేదు.

More Telugu News