Uttarakhand: ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ ప్రయాణిస్తోన్న కారు బోల్తా

  • ఎంపీ తీరత్ సింగ్ రావత్ కి గాయాలు
  • ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా ఘటన
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఎంపీ

ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. హరిద్వార్ లోని భీమ్ గోదా మీదుగా ఆయన ఈ రోజు ఉదయం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయనకు గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తీరత్ సింగ్ రావత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. ఆయన ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఆయన ఘర్వాల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

More Telugu News