BS-6 standard bike: బీఎస్-6 రేసులో యమహా మోటార్ ఇండియా

  • ఎఫ్ జడ్ సిరీస్ లో రెండు బైకుల విడుదల
  • దేశ వ్యాప్తంగా ఈ నెలలో అమ్మకాలు ప్రారంభం
  • ఎక్స్ షోరూం ధరలు రూ.99,200 నుంచి ప్రారంభం

బీఎస్ -6 ప్రమాణాలు కలిగిన బైక్ ల విడుదలలో క్రమంగా పోటీ తీవ్రంగా మారుతోంది. ఇటీవల హీరో మోటో కార్ప్ బీఎస్ 6 స్టాండర్డ్స్ తో స్ల్పెండర్ ఐస్మార్ట్ ను విడుదల చేసి, బైక్ ల విభాగంలో ఈ ప్రమాణాలు గల తొలి కంపెనీగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా యమహా మోటార్ (ఐవైఎం) ఇండియా విభాగం కూడా బీఎస్-6 ప్రమాణాలతో రెండు కొత్త బైకులను ఈ రోజు విడుదల చేసింది.

ఎఫ్ జడ్ సిరీస్ లో భాగంగా  ఎఫ్ జడ్-ఎఫ్ఐ, ఎఫ్ జడ్ఎస్-ఎఫ్ఐ వేరియంట్లను తీసుకువచ్చింది. వీటికి 150 సీసీ ఇంజన్లను అమర్చారు. కాగా ముందువైపు సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఉంటుంది. ముందు, వెనకవైపునా డిస్క్ బ్రేక్ లను కలిగివుంటాయి. ఈ నెలలోనే దేశ వ్యాప్తంగా ఉన్న తమ షోరూముల్లో విక్రయాలు ప్రారంభిస్తున్నామని సంస్థ ఛైర్మన్ మోటో ఫుమి షితారా చెప్పారు. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ.99,200 నుంచి రూ.1.02 లక్షలవరకు ఉంటాయన్నారు.  

More Telugu News