second saturday: నేడు యథావిధిగా పనిచేయనున్న తెలంగాణ విద్యాసంస్థలు

  • ఆర్టీసీ సమ్మెతో దసరా సెలవుల పొడిగింపు
  • పెండింగ్ సిలబస్‌ను పూర్తిచేసేందుకు సెలవుల రద్దు
  • వచ్చే ఏడాది మార్చి వరకు సెలవులు రద్దని ఉత్తర్వులు జారీ

నేడు రెండో శనివారమైనా తెలంగాణ విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు, యూనివర్సిటీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. సెలవుల పొడిగింపు కారణంగా సిలబస్ పెండింగ్‌లో ఉందని, దానిని సకాలంలో పూర్తి చేసేందుకు ఇకపై ప్రతీ రెండో శనివారం విద్యాసంస్థలు పనిచేస్తాయని వివరించాయి. 2020 మార్చి వరకూ ఇదే మార్గదర్శకం అమలవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.

More Telugu News