Maharashtra: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

  • ఈ రోజు అర్ధరాత్రితో పూర్తి కానున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు
  • కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కొనసాగుతున్న ఉత్కంఠ
  • రాష్ట్రపతి పాలన విధించే అవకాశం

మహారాష్ట్రలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో ఆయన తన మంత్రులతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో సహకరించిన సహచర పార్టీ నాయకులు, శివసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

More Telugu News